YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే వ్యాక్సిన్‌ సరఫరా... కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే వ్యాక్సిన్‌ సరఫరా... కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

న్యూఢిల్లీ ఏప్రిల్ 24
కరోనా వ్యాక్సిన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలకు ఉచితంగానే వ్యాక్సిన్‌ను సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు విషయాన్ని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేస్తూ కేంద్రం వ్యాక్సిన్లపై స్పష్టతనిచ్చింది. కరోనా ఒక డోసును రూ.150కే తయారీ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఈ మేరకు కొనుగోలు చేసిన టీకాలను రాష్ట్రాలకు సరఫరా చేయనున్నట్లు వెల్లడించింది. ఇటీవల ఓ టీకా తయారీ సంస్థ కేంద్రానికి ఒక డోసుకు రూ.150, రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు హాస్పిటల్స్‌కు రూ.600కు సరఫరా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Related Posts