YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్

ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్

కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్ మోహన్ రెడ్డి గారు *ఫోకస్ టెస్టింగ్* పైన దృష్టి పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 104 కాల్ సెంటర్ కు ప్రతి దినం పదివేలకు పైగా ఎంక్వైరీ లు వస్తున్నాయి అందులో ముఖ్యంగా టెస్టింగ్ విషయమై ఎంక్వైరీలు కూడా ఉన్నాయి. రమారమి 70 వేలకు పైగా ప్రైమెరీ కాంటాక్ట్స్ కు టెస్టింగ్ చేయవలసి ఉంది. ప్రతినిత్యం ఫోకస్ టెస్టింగ్ రూపేనా 35 వేల టెస్టులు చేస్తూ ఉన్నాము. బ్యాక్లాగ్ పెరగటం వలన టెస్ట్ రిపోర్టులు కొద్దిగా ఆలస్యం అవుతూ ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రివ్యూ మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు బ్యాక్లాగ్ క్లియర్ అయ్యేవరకు, ట్రునాట్ మరియు రాపిడ్ టెస్ట్లను కూడా మొదలు పెట్టవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ట్రూనాట్ పరీక్ష, RT-PCR మాదిరిగానే పనిచేస్తుంది, కానీ చిన్న కిట్‌తో పనిచేస్తుంది. అలాగే వేగంగా ఫలితాలను ఇస్తుంది. కోవిడ్ -19 కోసం స్క్రీనింగ్ మరియు నిర్ధారణ కోస వాడే  ట్రూనాట్ యంత్రం చిప్-ఆధారితంగా పనిచేస్తుంది. ఇది బ్యాటరీలపై నడుస్తుంది. ఇది కూడా నోరు, ముక్కు లోని స్వాబ్ ద్వారా వైరస్ కనుగొనాల్సి ఉంది. వైరస్ RNAలో కనిపించే RdRp ఎంజైమ్‌ను గుర్తించడానికి ఈ యంత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ట్రూనాట్ పరీక్ష 60 నిమిషాల్లో ఫలితాలను అందిస్తుంది. ఏరియా ఆస్పత్రిలో ఈ పరీక్షలను మొదలు పెట్టినట్లయితే ఫలితాలు త్వరగా రావటమే కాకుండా డిస్ట్రిక్ట్ ఆస్పత్రుల పైన పని భారం అని తగ్గుతుంది, టెస్టులు ప్రజలకు మరింత చేరువులో ఉంటాయి. త్వరితగతిన ఈ మెషిన్ లో ఉన్న సాఫ్ట్ వేర్ ని అప్డేట్ చేయబోతున్నారు వచ్చే 48 గంటల్లోపు కిట్స్ కూడా జిల్లాలకు పంపించి ట్రూ నాట్ టెస్ట్ మొదలు పెట్టబోతున్నారు. కావలసిన టెక్నికల్ సిబ్బందిని కూడా రెడీ చేస్తున్నారు. రాపిడ్ టెస్టులు కూడా వన్ టైం  అనుమతి తో బ్యాక్లాగ్ క్లియర్ చేయటానికి వాడబడతాయి. టెస్టుల విషయంలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం కు అన్ని సూచనలు ఇవ్వడం జరిగింది.
Courtesy: డాక్టర్ శ్రీకాంత్ అర్జా
ఏపీ స్టేట్ కొవిడ్  నోడల్ ఆఫీసర్

Related Posts