హైదరాబాద్ ఏప్రిల్ 25,
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ప్రజా సంఘాలను అణగద్రొక్కుతూ...పోలీసులు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలపై అక్రమ కేసులు పెడుతున్నారని బీజేపీ నేత లక్ష్మణ్ మండిపడ్డారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నిషేధించడం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై అనేక దఫాలుగా పోరాడుతున్న సంస్థలను మావోలతో ముడి పెట్టి నిషేధించడం సరైన పద్ధతి కాదని చెప్పారు. గత 50 సంవత్సరాలుగా పనిచేస్తున్న సంఘాలు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కడ చేసామో ప్రభుత్వం చూపించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య బద్దంగా, రాజ్యాంగం బద్ధంగా సభలు సమావేశాలు పెట్టి ప్రజా సమస్యల కోసం పొరుడుతున్నామని, ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న సంఘాలను నిషేధించడం దారుణమన్నారు.