YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అట్టహాసంగా సాగిన ప్లీనరీ

 అట్టహాసంగా సాగిన ప్లీనరీ

కొంపల్లిలోని జీబీఆర్ గార్డెన్‌లో 90 ఎకరాల ప్రదేశంలో ప్లీనరీ నిర్వహణకు అట్టహాసంగా ముగిసింది. ప్లీనరీ వేదికకు ‘ప్రగతి ప్రాంగణంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. సుమారు 23 దేశాల నుంచి ఎన్నారై ప్రతినిధులు కూడా హాజరయ్యారు. వీరందరి కోసం తెలంగాణ ప్రత్యేక రుచులతో వంటలు సిద్ధం చేశారు. వీటిలో కోడికూర, మటన్ బిర్యానీ, పచ్చి పులుసు తదితరాలు ఉండనున్నాయి.ఎండ నుంచి ఉపశమనం పొందడానికి మజ్జిగ, చల్లని నీరు, అంబలి కూడా ప్రతినిధులకు అందుబాటులో ఉంచారు. ప్లీనరీకి పోలీసులు ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపు తదితర అంశాలపై స్పష్టత ఇచ్చారు. సభా ప్రాంగణంలో వైద్య సిబ్బంది, ఫైర్ ఇంజన్లను అందుబాటులో ఉంచారు.ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ గురించి కార్యకర్తలకు మరింత స్పష్టత ఇచ్చారు. చైనాకు, మనదేశానికి హిమాలయాలే అడ్డు. 1960లలో చైనా జాతీయాదాయం 134 బిలియన్ డాలర్లు అయితే.. భాతర జాతీయాదాయం 180 బిలియన్ డాలర్లు. ప్రస్తుతం చైనా జాతీయాదాయం 9500 బి.డాలర్లు కాగా.. మనది 2465 బి.డాలర్లు. భారత్ కంటే తక్కువ జాతీయాదాయం ఉన్న చైనా 3, 4 దశాబ్దాలలో మనకంటే నాలుగింతలైంది. మన పాలకులు ఏం చేస్తున్నట్టు? ఫెడరల్ ఫ్రంట్‌పై అవహేళన చేస్తున్నవారు ఉలిక్కిపడేలా చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దేశానికి మంచి దారి చూపెడతానని అన్నారు.  కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన వైనం, ఇక్కడి సంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న తీరునువివరించనున్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళుతూ.. దేశానికే ఆదర్శ రాష్ట్రంగా ఎదిగిన తీరును వివరించనున్నట్లు సమాచారం.ప్లీనరీకి వచ్చే కార్యకర్తలకు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన నోట్‌లను కూడా అందించారు. గత నాలుగేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కార్యక్రమాలు, సాధించిన విజయాల గురించి కేసీఆర్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు.

కళ్యాణ లక్ష్మీ/ షాదీ ముబారక్, ఆసరా ఫించన్లు, కేసీఆర్ కిట్లు, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం తదితర పథకాల గురించి కేసీఆర్ వివరించారు. అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించడానికి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న రైతు బంధు పథకం గురించి ప్రతినిధులకు ప్రత్యేకంగా వివరించారు.వీటితో పాటు రాష్ట్రంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రతినిధులకు వివరించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరత, హరితహారం తదితర పథకాల గురించి ప్రస్తావించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన వైనాన్ని కార్యకర్తలకు వివరించారు. ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో పాటు, రైతు బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరాన్ని వివరించి, టీఆర్‌ఎస్ శ్రేణులకు అవగాహన కల్పించారు.

Related Posts