YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

భార్య చనిపోతే సూసైడ్

 భార్య చనిపోతే సూసైడ్

భార్య, భర్త ఇద్దరు పిల్లలు... మధ్యతరగతి కుటుంబమైనా ఉన్నదాంట్లో సర్థుకుపోతూ సాఫీగా సాగిపోతున్న జీవితం. ఇంతలోనే అనారోగ్యం రూపంలో భార్యను మృత్యువు వెంటాడటంతో గత నెలలో ఆమె చనిపోయింది... భార్య మరణాన్ని జీర్ణించుకోలేని భర్త... ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలంరేపింది. కొప్పురావుకాలనీ 11వ లైన్‌కు చెందిన తిరువీధుల లక్ష్మీనారాయణ, శిరీష దంపతులకు ఇద్దరు కుమారులు. ఆర్థికంగా పరిస్థితులు అంత మెరుగ్గా లేకపోయినా... భార్యా, పిల్లలతో కలిసి హాయిగా ఉంటున్నాడు. కొద్ది రోజుల క్రితం శిరీష అనారోగ్యంతో మంచంపట్టింది. భార్యను వైద్యం కోసం ఆస్పత్రులన్నీ తిప్పినా... ఫలితం లేకుండా పోయింది. ఆమె ఆరోగ్యం విషమించడంతో గత నెలలో చనిపోయింది. శిరీష మృతి తర్వాత బాగా కృంగిపోయిన లక్ష్మీనారాయణ... ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. గురువారం తెల్లవారుజామున తాము చనిపోతున్నట్లు బంధువులు, స్నేహితులకు మెసేజ్ పెట్టాడు. ఇద్దరు కొడుకులతో కలిసి పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ మెసేజ్‌ను చూసిన ఓ వ్యక్తి లక్ష్మీనారాయణ తండ్రికి సమాచారం అందించాడు. వారు వెంటనే మంగళగిరి వచ్చి చూడగా... ముగ్గురు ఇంట్లో విగత జీవులుగా పడి ఉన్నారు. అందరితో కలివిడిగా ఉండే కుటుంబం ఉన్నట్టుండి ఇలా ప్రాణాలు తీసుకోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది. 

Related Posts