YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

కొరియాల మధ్య భారీ ఒప్పందాలు

కొరియాల మధ్య భారీ ఒప్పందాలు

ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తొలిసారి సరిహద్దు దాటి దక్షిణ కొరియాలో అడుగుపెట్టి ఆ దేశాధ్యక్షుడు మూన్ జేతో చేతులు కలిపారు. రెండు దేశాలను విభజించే సైనిక సరిహద్దు రేఖను దాటిన కిమ్.. మూన్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆయన చేతిని ఆప్యాయంగా అందుకున్న మూన్ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు  చారిత్రక సదస్సు ముందు చిరకాల ప్రత్యర్థులు ఇద్దరు శుక్రవారం చేతులు కలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొరియా యుద్ధం ముగిసిన 65 ఏళ్ల తర్వాత అంటే 1953 తర్వాత ఇరు దేశాల నేతలు కలుసుకోవడం ఇదే తొలిసారి.బద్ధశత్రువులైనా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాలు ఎట్టకేలకు చేతులు కలిపాయి. చిరకాల వైరాన్ని పక్కనపెడుతూ.. శాంతి స్థాపన దిశగా ముందుకుసాగాయి. ఇరుదేశాల సరిహద్దులోని పన్‌ముంజుమ్‌ గ్రామంలో ఉన్న మూడంతస్థుల భవనం ‘పీస్‌ హౌస్‌’ ఇందుకు వేదికైంది. ఈ మేరకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ల మధ్య శుక్రవారం  చారిత్రక సమావేశం జరిగింది. కొరియా యుద్ధం తర్వాత దాదాపు 65 సంవత్సరాల తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు దక్షిణ కొరియాలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ రెండు దేశాల సరిహద్దు రేఖ వద్ద దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ను కలిశారు. తమ దేశంలోకి రావాలని ఆహ్వానించడంతో మొదట మూన్‌ జే ఉత్తర కొరియా భూభాగంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇరువురు నేతలు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నడవడం కొత్త శకానికి నాంది పలికింది. అనంతరం కిమ్‌ దక్షిణ కొరియాలోకి అడుగుపెట్టారు. సరిహద్దులోని ‘పీస్‌ హౌస్‌’లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. కిమ్‌తో పాటు ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు కిమ్ జోంగ్... 'తాను ఎంతో ఉద్వేగానికి గురవుతున్నాను' అని మూన్‌ జే ఇన్‌తో అన్నారు. ఇరుదేశాల మధ్య కొత్త చరిత్ర లిఖించడానికి స్పష్టమైన ఆలోచనా విధానంతో తాను ఇక్కడికి వచ్చినట్లు కిమ్ చెప్పారు. ఇరు దేశాల మధ్య గొప్ప ఒప్పందం జరిగే అవకాశం ఉందని, ఇది కొరియా ప్రజలందరికీ చక్కటి బహుమతి కానుందని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ అన్నారు. 

Related Posts