ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడు ఎవరు? అనే అంశం ఆసక్తిదాయకంగా మారుతోంది. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి తేజ తప్పుకోవడంతో ఆ స్థానంలో ఎవరు బాధ్యతలు తీసుకుంటారు? అనేది చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. కొత్తగా బాధ్యతలు ఎవరికనే అంశంలో చాలా పేర్లే వినిపిస్తున్నాయి. సీనియర్ దర్శకుడు కే రాఘవేంద్రరావుతో పాటు క్రిష్, కృష్ణవంశీల పేర్లు కూడా ఈ విషయంలో వినిపిస్తున్నాయి. అయితే ఏదీ ఖరారు కాలేదు. అలాగే బాలయ్య ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకుంటారనే టాక్ ఉంది.అలాంటి ఊహాగానాలు ఉండగానే ఇప్పుడు ఈ విషయంలో మరో పేరు తెరపైకి వచ్చింది. అదే సాయి మాధవ్ బుర్రా. రచయితగా సూపర్ హిట్ సినిమాలకు పని చేసిన సాయి మాధవ్ ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నాడని, ఎన్టీఆర్ బయోపిక్కు ఆయనే దర్శకుడు అనే టాక్ వినిపిస్తోంది. ఇది వరకూ బాలయ్యతో పని చేసిన అనుభవం ఉంది సాయి మాధవ్కు. గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు రచయితగా పని చేశారీయన.అలాగే ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘గోపాల గోపాల’ వంటి సినిమాలకు కూడా రచయితగా పని చేశారు. ఆ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని దర్శకుడిగా ఈయన పేరును పరిశీలిస్తున్నాడట బాలయ్య. ఇలాంటి ఊహాగానాల నేపథ్యంలో అధికారిక ప్రకటనపై మరింత ఆసక్తి పెరుగుతోంది