YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీ నాయ‌కుల మాట‌లు న‌మ్మొద్దు.. మంత్రి హ‌రీష్ రావు

బీజేపీ నాయ‌కుల మాట‌లు న‌మ్మొద్దు..  మంత్రి హ‌రీష్ రావు

సిద్దిపేట ఏప్రిల్ 27
బీజేపీ నాయ‌కుల క‌ల్లబొల్లి మాట‌లు న‌మ్మొద్దు.. ఝూఠ‌గాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని మంత్రి హ‌రీష్ రావు సిద్దిపేట ఓటర్ల‌కు సూచించారు. సిద్దిపేట మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో భాగంగా లింగారెడ్డిప‌ల్లి, రేణుక న‌గ‌ర్ వార్డుల్లో హ‌రీష్ రావు ప్ర‌చారం నిర్వ‌హించారు.తెలంగాణ‌కు కేంద్రం రూ. 135 కోట్లు ఇచ్చింద‌ని బీజేపీ నాయ‌కులు ప్ర‌చారం చేస్తున్నారు. కానీ కేంద్రం తెలంగాణ‌కు రూ. 135 ఇచ్చిన దాఖ‌లాలు లేవ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. బీజేపీ ప్ర‌భుత్వంలో అన్ని ధ‌ర‌లు పెరిగాయ‌న్నారు. పెరిగిన ధ‌ర‌ల‌తో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని తెలిపారు. క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌ను ఆదుకోని నాయ‌కులు.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నార‌ని ప్ర‌శ్నించారు. ద‌ళితుల కోసం ఈ ఏడాది బ‌డ్జెట్‌లో రూ. వెయ్యి కోట్ల‌తో సీఎం ద‌ళిత్ ఎంప‌వ‌ర్‌మెంట్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టామ‌ని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డ నాయ‌కుల‌కు నామినేటేడ్ ప‌ద‌వులు ఇచ్చి గౌర‌వించుకుంటామ‌ని మంత్రి హ‌రీష్ రావు పేర్కొన్నారు.

Related Posts