అమరావతి
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు కరీనా రోగులకు జరుగుతున్న చికిత్స పై హైకోర్టులో విచారణ జరిగింది. మంగళవారం నాడు సుమారు గంట సేపు విచారణ కొనసాగింది. ప్రస్తుత పరిస్థితులపై పలు ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఆక్సిజన్ నిల్వలు సరైన ఉన్నాయా, ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ నిల్వలు ఎంతకాలం సరిపోతాయని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్ని ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు తెరిచారు. రాష్ట్రంలో ఎన్ని ఐసోలేషన్ వార్డులో ఏర్పాటు చేశారు. కరోనా పరీక్షలు ఎంత మేర పెంచారని ప్రశ్నించింది. పరీక్షల అనంతరం నివేదిక ఎన్ని రోజుల్లో వస్తాయి. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పడకలు, సౌకర్యాలు సరిపడా ఉన్నాయా అని ప్రశ్నించింది. అన్ని వివరాలను పిటిషనర్ కౌన్సిల్ తో పాటు తమకు అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారంనికి వాయిదా వేసింది.