YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లాలంటే వారికి క‌రోనా నెగిటివ్ రిపోర్టు త‌ప్ప‌నిస‌రి

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లాలంటే వారికి క‌రోనా నెగిటివ్ రిపోర్టు త‌ప్ప‌నిస‌రి

న్యూఢిల్లీ ఏప్రిల్ 28
మే 2న నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే రోజు, అనంతరం జరిగే అన్ని విజయోత్సవ ర్యాలీలపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిషేధం విధించిన విష‌యం విదిత‌మే. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి వెళ్లాల‌నుకునే అభ్య‌ర్థులు, వారి ఏజెంట్లు క‌రోనా నెగిటివ్ రిపోర్టు త‌ప్ప‌నిస‌రిగా చూపించాలి. లేదా రెండు డోసుల టీకా తీసుకున్న‌ట్లు ఆధారాలు చూపించాలి. ఈ రెండింటిలో ఏదో ఒక‌టి చూపిస్తేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమ‌తి ఉంటుంది. అయితే ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లే కంటే 48 గంట‌ల ముందు చేయించిన‌ది అయి ఉండాల‌ని నిబంధ‌న విధించింది. అంత‌కంటే ముందు రిపోర్టు చూపించ‌డానికి వీల్లేదు.

Related Posts