YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆరోగ్యం దేశీయం

కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

కరోనా నుంచి కోలుకున్న మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

మాజీ ప్రధాని, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మన్మోహన్‌ సింగ్‌ కరోనా నుంచి కోలుకున్నారు. ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ (ఎయిమ్స్‌)లోని ట్రామా సెంటర్‌ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు మన్మోహన్‌ డిశ్చార్జి అయినట్టు ఎయిమ్స్‌ ట్వీట్‌ చేసింది. ఈ నెల 19న ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో వెంటనే చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరారు. వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న అనంతరం కరోనా పాజిటివ్‌గా పరీక్షలు చేశారు. గత నెల మార్చి 4న తొలి డోసు, ఏప్రిల్‌ 3న రెండో డోసు తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా బారినపడిన మన్మోహన్‌ కోలుకువాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా, రాహుల్‌ గాంధీ తదితర ప్రముఖులు త్వరగా కోవాలని ఆకాంక్షించారు.

Related Posts