సిద్దిపేట
ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వినియోగించుకోవడం మన సామాజిక బాధ్యత అని మంత్రి హరీష్ రావు సిద్దిపేట పట్టణ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ప్రతీ ఒక్కరూ విధిగా ఓటు వేయాలని అన్నారు. అన్ని విధాల అర్హులైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని చెప్పారు. అయితే కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో స్వీయ జాగ్రత్తలు పాటించాలి. మాస్కు ధరించి శానిటైజర్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు . భౌతికదూరం తప్పనిసరి. పోలింగ్ కేంద్రంలోనూ కోవిడ్ నిబంధనలు ఉంటాయని . వీటిని అనుసరించాలి. గుంపులుగా ఉండవద్దు. సామాజిక బాధ్యతతోపాటు ఆరోగ్య రక్షణను కూడా గ్రహించాలన్నారు...