YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఐదువందల రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

ఐదువందల రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

అమరావతి
అమరావతి రాజధాని ఉద్యమం మరో మైలురాయిని దాటింది.500 రోజులు పూర్తి చేసుకున్న ఉద్యమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.178 మంది రైతులు బలిదానాలు 500 రోజుల ఉద్యమ ఫలితమని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఈ రోజు రాజధాని విశాఖకు తరలిపోవడం లేదంటే అది రైతుల, దళితుల ఉద్యమ ఫలితమని చెప్పుకొచ్చారు. ప్రజా రాజధాని ఉద్యమం చాలా గొప్పగా సాగుతుందని అన్నారు. జాతీయ నాయకులు కూడా వర్చువల్ బహిరంగ సభలో భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. ఒక వైపు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇక్కడ శంకుస్థాపన నిన్ననే చేసిందన్నారు. 6 ఎస్సి నియోజకవర్గాల మధ్యలో అమరావతి రాజధాని ఉందని అన్నారు. న్యాయపోరాటం ద్వారా న్యాయం, ధర్మం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు కూడా వర్చువల్ బహిరంగ సభలో పాల్గొంటారని దేవినేని ఉమ వెల్లడించారు.

Related Posts