రాజమండ్రి
సంఘం డెయిరీలో అక్రమాలకు పాల్ప డ్డారనే ఆరోపణలపై అరెస్టు అయి రిమాండ్లో ఉన్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది.తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి ఆయనను విజయవాడ తరలించారు. ఆయనతో పాటు సంఘం డెయిరీ ఎండీ, సహకార శాఖ మాజీ అధికారి గురునాథంను తీసుకెళ్లారు. వీరిని ఈ నెల 5 వరకు విచారించేందుకు ఎసిబి ప్రత్యేక న్యాయస్థానం అనుమతిచ్చింది. ఆ మేరకు రాజమహేంద్రవరం నుంచి విజయవాడ తరలించారు. జైలు వద్ద తండ్రిని చూసి నరేంద్ర కుమార్తె కన్నీరుమున్నీరయ్యారు.