హైదరాబాద్ మే 1
తెలంగాణలో రాజకీయ వాతావరణం హీట్ ఎక్కింది. ఇప్పటికే ఈటల వ్యవహారంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా విధులు నిర్వహించిన ఈటల రాజేందర్ పోర్టుఫోలియోను మార్చాలని సీఎం కేసీఆర్.. గవర్నర్ తమిళిసైకు లేఖ రాశారు. దీంతో వైద్యశాఖను సీఎంకు కేటాయిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో వైద్య ఆరోగ్యశాఖ సీఎం చూసుకోనున్నారు.