YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగురూకతతో వ్యవహరించాలి. సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ

ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగురూకతతో వ్యవహరించాలి. సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ

ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగురూకతతో వ్యవహరించాలి
          సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ
హైద‌రాబాద్ మే 1
కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, రోజుకు మూడు సార్లు స‌మీక్ష జ‌రిపి స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించాల‌ని సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రెమ్‌డెసివిర్, ఆక్సిజ‌న్, వ్యాక్సిన్, బెడ్ల ల‌భ్య‌త‌లో ఎలాంటి లోపం రానివ్వొద్ద‌ని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. ఆరోగ్య శాఖ ఉన్న‌తాధికారులంద‌రూ స‌మ‌న్వ‌యంతో ప‌ని చేసి రాష్ర్టాన్ని క‌రోనా బారి నుంచి బ‌య‌ట‌ప‌డేయాల‌ని కేసీఆర్ సూచించారు.అనుక్షణం కరోనా పర్యవేక్షణకు సీఎంవో నుంచి సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రి నియమించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులందరూ జాగురూకతతో వ్యవహరిస్తూ, చక్కగా పనిచేసి అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుండి బయటపడేయాలని సీఎం ఆదేశించారు.ఈట‌ల రాజేంద‌ర్ వ‌ద్ద ఉన్న వైద్యారోగ్య శాఖ‌ను సీఎం కేసీఆర్ త‌న ఆధీనంలోకి తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈట‌ల‌పై భూక‌బ్జాల ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో వైద్యారోగ్య శాఖ‌ను త‌న‌కు కేటాయించాల‌ని గ‌వ‌ర్న‌ర్‌కు సీఎం కేసీఆర్ సిఫార‌సు చేశారు. సీఎం సిఫార‌సుకు గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ఆమోదం తెలిపారు. ఇక వైద్యారోగ్య శాఖ త‌న ఆధీనంలోకి రావ‌డంతో క‌రోనా నివార‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై దృష్టి సారించారు. ఆ చ‌ర్య‌ల్లో భాగంగానే త‌న కార్య‌ద‌ర్శి రాజశేఖ‌ర్ రెడ్డిని క‌రోనా ప‌ర్య‌వేక్ష‌ణ‌కు నియ‌మించారు.

Related Posts