కాకినాడ
కోవిడ్ -19 మేనేజ్మెంట్ నిర్వహణ, వ్యాక్సినేషన్ , తదితర అంశాలపై తూర్పుగోదావరి జిల్లా ఉన్నతాధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కుటుంబ సంక్షేమం,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని సమీక్షా సమావేశాన్నిశనివారం నిర్వహించారు.జిల్లాలో పెరుగుతున్న కోవిడ్ కేసులను కట్టడి చేయ్యడంలో తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత స్ధాయిలో చర్చించారు.రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా మహామ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం నిబందనలు పాటించడంతో పాటుగా కోవిడ్ కేర్ కేంధ్రాలను పతిష్టం చెయ్యాలని సూచించారు.