మైలవరం పట్టణంలో మంచినీటి సమస్యను పరిష్కరించేందుకు 13,14 వ ఆర్థిక సంఘం నిధులు 14 లక్షల రూపాయలతో ఫ్లోరైడ్ రహిత కృష్ణానది నీటిని అందించేందుకు పైప్లైన్ విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మైలవరం నుండి విజయవాడ వైపువెళ్ళే ప్రధాన రహదారిలో, మైలవరం బోసుబొమ్మ సెంటరు నుండి ప్రభుత్వ జూనియర్ కలశాల వరకూ ప్రధాన రహదారి పక్కనే ప్రధాన పైప్లైన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వేస్తున్న ప్రధాన పైప్లైన్కు అంతర్గత పైప్లైన్ల లింకు కలిపి అన్ని అంతర్గత రహదారులకు విస్తరించి తద్వారా ఇళ్ళకు ట్యాప్లు ఏర్పాటు చేసే విధంగా పనులు కొనసాగిస్తున్నారు. ప్రతి వీధిలోని ప్రతి ఇంటికి ఫ్లోరైడ్ రహిత కృష్ణా జలాలను అందించాలన్న లక్ష్యంతో పనులు నిర్వహిస్తున్నారు. పైప్లైన్ విస్తరణ పనులను వారు పరిశీలించి సిబ్బందిని అప్రమత్తం చేశారు.