అమరావతి
క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తిరుపతి ఎంపిగా ఎన్నికైన డాక్టర్ ఎం. గురుమూర్తి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో 2,71,592 ఓట్ల మెజార్టీని సాధించి ఘన విజయం సాధించిన డాక్టర్ ఎం. గురుమూర్తిని, పార్టీ నేతలను సీఎం అభినందించారు. డాక్టర్ ఎం. గురుమూర్తి గెలుపు ధ్రువీకరణ పత్రాన్ని ముఖ్యమంత్రికి చూపించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ నేతలు భూమన అభినయ్రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, ఎంఆర్సీ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.