YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

పాత్రికేయులకు ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు - ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

పాత్రికేయులకు ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు - ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ
ప్రపంచ పత్రికాస్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా  భారతీయ పాత్రికేయులకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమాచార యుగంలో వాస్తవమైన, సంచలనాలకు తావులేని వార్తను ప్రజలకు అందించడంలో పాత్రికేయులు పోషించాల్సిన పాత్ర మరింత కీలకమని అయన ట్వీట్టర్ ద్వారా పేర్కోన్నారు.  తప్పుడు సమాచారం నుంచి సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిదే. కరోనా నేపథ్యంలోనూ ప్రజలకు సరైన సమాచారాన్ని అందజేసి, వారిలో ధైర్యాన్ని నింపిన పాత్రికేయుల పాత్ర అభినందనీయమని అయన అన్నారు.  పత్రికాస్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ, ప్రజల సమస్యలను మరీ ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి విషయంలో మీడియా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు.

Related Posts