హైదరాబాద్
రామాయంపేట మాజీ ఎమ్మెల్యే రాజయ్యగారి ముత్యంరెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. రాజకీయాల్లో తనతోపాటు కలిసి పనిచేసిన గతాన్ని స్మరించుకున్నారు. ఎమ్మెల్సీగా, జెడ్పీ చైర్మన్గా పనిచేసిన ముత్యంరెడ్డి.. తన ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. మెదక్ జిల్లా ఓ ఆదర్శ నేతను కోల్పోయిందని చెప్పారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.