YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఖర్చులే తప్ప ముందుకు సాగని జన్మభూమి పనులు

 ఖర్చులే తప్ప ముందుకు సాగని జన్మభూమి పనులు

జన్మభూమి–మాఊరు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తోంది. ఏడాదిన్నరలో ఒక్క ఇల్లుగానీ, స్థలాన్నిగానీ ఇవ్వలేదు. అయినా ఆరు లక్షల అర్జీలు పరిష్కారమయ్యాయి. ఇదెలా సాధ్య పడిందనుకుంటున్నారా? ఏమీ లేదండీ ఇది 'జన్మభూమి మా ఊరు నివేదిక' అంకెల గారడియే. రెండు విడతలుగా నిర్వహించిన జన్మభూమి గ్రామసభల్లో గృహ నిర్మాణ శాఖకు 7.74 లక్షల అర్జీలు వచ్చాయని, అందులో 6.19 లక్షలు పరిష్కారమైనట్లు ప్రభుత్వం జన్మభూమి నివేదికలో పొందుపరిచింది. రెండు విడతల సభల్లోనూ అన్ని అర్జీలు 34.85 లక్షలుండగా, 31.60 లక్షలు పరిష్కారమవ్వగా, మరో 3.25 లక్షలే పెండింగ్‌లో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ నివేదిక వాస్తవికతకు ఎంత తేడా ఉందో ఒక్క గృహనిర్మాణశాఖ అర్జీలను చూస్తేనే అర్థమవుతోంది. జన్మభూమి గ్రామ సభల్లో ఇళ్లు, స్థలాలు కావాలని 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో ఒక్కరంటే ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇంటి స్థలాన్నిగానీ, ఇంటినిగానీ మంజూరు చేయలేదు. అయినా 90 శాతం అర్జీలను పరిష్కరించినట్లు పేర్కొనటం ప్రభుత్వ తప్పుడు నివేదికలకు నిదర్శనంగా నిలుస్తోంగ్రామసభలను ఆర్భాటంగా చేపట్టేందుకు నిధులను నీళ్లలా ఖర్చు చేస్తోంది. ఒకవైపు లోటు బడ్జెట్‌ అంటూనే సొంత ప్రచారానికి మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చు చేసేందుకు    వెనుకాడటం లేదు. ఏడాది జనవరిలో జన్మభూమి–మాఊరు  కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో ఇందుకోసం రూ.96,84,000 ఖర్చు చేశారు. ప్రజల నుంచి లక్షకుపైగా దరఖాస్తులు రాగా అందులో 70వేల అర్జీలు పరిష్కరించినట్లు జిల్లా యంత్రాంగం పేర్కొంటోం ది. వాస్తవానికి అందుకు విరుద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అధికారులు అర్జీలు తీసుకొని వాటిని సంబంధిత అధికారులకు పంపించడంతో వాటిని పరిష్కరించినట్లుగా లెక్కలు చూపిస్తున్నారు.ప్రభుత్వం వద్ద మంచి మార్కులు కొట్టేసి రాష్ట్రంలోనే అగ్రభాగంలో ఉన్నట్లు చూపేందుకు యంత్రాంగం ప్రయత్నిస్తోంది. వాస్తవానికి గ్రామసభల్లో అర్జీలన్నీంటిని సంబంధిత శాఖలకు పంపించామా లేదా అన్నట్టుంది యంత్రాంగం వ్యవహారశైలి ఉంది. ఇదే విషయాన్ని అనేక మంది బాధితులు కూడా ధృవీకరిస్తున్నారు. జన్మభూమి సభల్లో తాము ఇచ్చిన అర్జీలకు ఇంతవరకు పరిష్కరించలేదని అనేక మంది సంబంధిత కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటం వాస్తవ పరిస్థితికి నిదర్శనం. పైగా వచ్చిన అర్జీల్లో అధిక భాగం రెవెన్యూ విభాగానికి చెందినవే. వాటికి పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో అధికారులకే తెలియాలి.నాలుగో విడత జన్మభూమికి జిల్లాకు కేటాయించిన నిధుల ఖర్చు లెక్కలో మాత్రం యంత్రాంగం ఓ అడుగు ముందే ఉంది. మండలానికి రూ.35 వేలు, మునిసిపాలిటీకి రూ.35వేలు, గ్రామ పంచాయతీకి రూ.5వేల చొప్పు న కేటాయించారు. పదిరోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమలో ప్రతి హైర్‌ వెహికల్‌కు రూ.15వేలు కేటాయించారు.జిల్లా కేంద్రమైన ఒంగోలులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమానికి రూ.75వేలు కేటాయించగా, కార్యాలయాల వాహనాలకు రూ.25వేల చొప్పున కేటాయించారు. అదర్‌ పేమెంట్‌ కింద మరో రూ.5వేలు కేటాయించారు.

Related Posts