YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చింతమనేని గొడవకు ఫుల్ స్టాప్

చింతమనేని గొడవకు  ఫుల్ స్టాప్

సీఎం పోస్టర్ వ్యవహారంలో రేగిన వివాదానికి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని పుల్‌స్టాప్ పెట్టేసినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ నేరుగా బాధితుడ్ని కలిసి ఈ కేసులో రాజీ చేసుకున్నారట. నిన్న హనుమాన్ జంక్షన్ వెళ్లిన ఎమ్మెల్యే... కొందరు స్థానిక నేతల్ని వెంటపెట్టుకొని బాధితుడు గరికపాటి నాగేశ్వరరావు సొంత ఊరైన అప్పనవీడు వెళ్లారట. అతడితో మాట్లాడిన చింతమనేని... జరిగిన ఘటనపై విచారణ వ్యక్తం చేశారట. అనుకోకుండా అలా జరిగిపోయిందని... ఇంతటితో వివాదానికి చెక్ పెట్టేద్దామని కోరారట. స్వయంగా ఎమ్మెల్యేనే వచ్చి రాజీకి అగడటంతో... బాధితుడు కూడా వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. అక్కడితో ఈ ఎపిసోడ్‌కు ఎండ్ కార్డ్ వేసేశారట.పది రోజుల క్రితం హనుమాన్ జంక్షన్ సమీపంలో ఆర్టీసీ బస్సు వెళుతోంది. అయితే బస్సుపై ఉన్న పోస్టర్‌లో సీఎం ఫోటో చినిగిపోయింది. అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే చింతమనేని... బస్సును ఆపారు. ఫోటో ఎందుకు చినిగిందంటూ ఆర్టీసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈలోపు అక్కడికి వచ్చిన నాగేశ్వరరావు అనే వ్యక్తి సర్థిచెప్పేందుకు ప్రయత్నించగా... ఎమ్మెల్యే దుర్భాషలాడుతూ... దాడి చేశాడు. దీనిపై బాధితుడు పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత విషయం తెలుసుకున్న స్థానికులు అతడికి మద్దతుగా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... వారికి సర్థిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.ఈ గొడవ చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లడంతో... చింతమనేనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలవాలని కూడా ఆదేశించగా... ఎమ్మెల్యే కలిసి వివరణ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. తర్వాత ఈ వ్యవహారం మరింత పెద్దది కాకుండా బాధితుడితో రాజీ చేసుకున్నారు.

Related Posts