న్యూఢిల్లీ మే 6
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం తమ పార్టీ లోక్సభ సభ్యులతో సమావేశం కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనున్న ఈ సమావేశంలో ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి పరిస్థితిపై చర్చించనున్నారు. దేశంలో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తీరు, ఆ మహమ్మారి కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వైఫల్యాలు, ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వైఖరి, స్పందించాల్సిన తీరు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.