YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

శుక్రవారం సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ లోక్‌స‌భ స‌భ్యుల‌తో స‌మావేశం

శుక్రవారం  సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ లోక్‌స‌భ స‌భ్యుల‌తో స‌మావేశం

న్యూఢిల్లీ మే 6 
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియాగాంధీ శుక్రవారం  త‌మ‌ పార్టీ లోక్‌స‌భ స‌భ్యుల‌తో స‌మావేశం కానున్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా జ‌రుగ‌నున్న ఈ స‌మావేశంలో ప్ర‌స్తుతం దేశంలో కొన‌సాగుతున్న క‌రోనా మ‌హ‌మ్మారి ప‌రిస్థితిపై చ‌ర్చించ‌నున్నారు. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రిస్తున్న తీరు, ఆ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు, వైఫ‌ల్యాలు, ప్ర‌ధాన ప్రతిప‌క్షంగా కాంగ్రెస్ పార్టీ అనుస‌రించాల్సిన వైఖ‌రి, స్పందించాల్సిన తీరు త‌దిత‌ర అంశాల‌పై ఈ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు తెలిపాయి.
 

Related Posts