YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరోనా పై కేసీఆర్ సమీక్ష

కరోనా పై కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్, మే 6,
కరోనా వైరస్ పరిస్థితిపై ప్రగతి భవన్ లో సీఎం సమీక్ష నిర్వహించారు. కరోనా నుంచి కోలుకున్న ఆయన రాష్ట్రంలో వైరస్ కట్టడిపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో ఫీవర్ టెస్ట్ లు ,వ్యాక్సినెషన్ , లాక్ డౌన్ పై ఈ సమీక్షలో చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు సీఎం. ఈ సందర్భంగా పలువురు అధికారులతో కూడా కేసీఆర్ సమావేశం నిర్వహించారు. సీఎం సమీక్ష నేపథ్యంలో జిల్లాల వారీగా కరోనా పరిస్థితిపై హెల్త్ సెక్రటరీ రిజ్వీ నివేదిక తెప్పించుకున్నారు.డీఎం అండ్ హెచ్ఓలకు టెలికాన్ఫరెన్స్‌లో డీహెచ్ మార్గదర్శకాలు జారీ చేశారు. మరికాసేపట్లో బీఆర్కే భవన్ లో డీహెచ్ శ్రీనివాస్ , డీఏంయి రమేష్ రెడ్డితో హెల్త్ సెక్రటరీ రిజ్వీతో సమావేశమయ్యారు. సీఎంకు వివరించే అంశాలపై చర్చించారు. మరోవైపు హైకోర్టు కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం సీరియస్ అయిన విషయం తెలిసిందే. నైట్ కర్ఫ్యూ సమయం కూడా పెంచాలని కోర్టు సర్కారుకు సూచించింది. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.నైట్ కర్ఫ్యూ పెట్టినా కేసులు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించింది. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ సమయం పెంచాలని పేర్కొంది. లాక్‌డౌన్ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అడిగింది. రాష్ట్రంలో వీకెండ్ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. ఈనెల 8 వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశించింది హైకోర్టు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ కరోనాపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించడంతో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Posts