YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వివాదం లో రోజకో ట్విస్ట్

వివాదం లో రోజకో ట్విస్ట్

హైదరాబాద్, మే 7, 
మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల వ్యవహారం‌పై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌ అయింది. పార్టీ నుంచి బహిష్కరించి, ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని స్పీకర్కు ఫిర్యాదు చేసే యోచనలో ఉంది. ఇప్పటికే ఈటలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్‌కు కరీంనగర్ జిల్లా నేతలు లేఖ ఇచ్చారు. ఇక ఈటలపై చర్యలు సీఎం కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అని తెలుస్తోంది. ఎమ్మెల్యే, మంత్రి పదవిని ఈటల దుర్వినియోగం చేశారని, రాజ్యాంగానికి తూట్లు పొడిచారని, చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరనున్నారట. కరోనా నుంచి కోలుకున్న ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి ప్రగతి భవన్‌కు రానున్నారు. ప్రగతి భవన్‌లో పార్టీ నేతలతో చర్చించి ఈటల ఎపిసోడ్‌కు ఎండ్ కార్డు వేయనున్నట్లు ఆ పార్టీ వర్గాల చెబుతున్న మాట ఇక దేవరయాంజల్ భూముల వ్యవహారంలో ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి టీఆర్ఎస్ అధిష్టానం తొలగించింది. ఎమ్మెల్యే పదవికి కూడా రాజానామా చేయాలని ఈటలకు సూచించింది. కానీ ఈటల రాజేందర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాజీనామా విషయాన్ని తాను ఎమ్మెల్యేగా గెలిచిన హుజురాబాద్ ప్రజల అభిప్రాయం ఈటల తీసుకున్నారు. ఈటలను రాజీనామా చేయొద్దని నియోజకవర్గ ప్రజలు సూచించినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే టీఆర్ఎస్ నేతలు ఈటలను టార్గెట్ చేశారు. అక్రమంగా ఈటల వేల కోట్లు సంపాదించుకున్నారని ఆరోపించారు.
రేవంత్ ఘాటు విమర్శలు
దేవ‌ర‌యంజాల్ భూములను టీఆర్‌ఎస్ నేత‌లు క‌బ్జా చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన రేవంత్ రెడ్డి మ‌రో స‌వాల్ విసిరారు. ఈరోజు సాయంత్రం ఆయ‌న దేవరయాంజాల్‌ భూములను ప‌రిశీలించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ దగ్గరి బంధువు గండ్ర శ్రీనివాస్‌రావు శ్రీని డెవలపర్స్‌ పేరుతో భూముల‌ను వెంచ‌ర్ చేశారిన సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 657 సర్వే నెంబర్‌లో మంత్రి మల్లారెడ్డి ఫామ్‌హౌస్ క‌ట్టుకున్నార‌ని ఆరోపించారు. ఇక ఈ భూముల వ్య‌వ‌హారంపై సీబీఐతో ఎంక్వ‌యిరీ జ‌రిపాలంటూ డిమాండ్ చేశారు.ఇక త‌న‌మీద ఆరోప‌ణ‌లు చేస్తున్న టీఆర్ ఎస్ నాయ‌కులు.. ద‌మ్ముంటే నిరూపిచాల‌ని స‌వాల్ విసిరారు. దేవ‌ర‌యంజాల్ భూముల్లో కేటీఆర్ స‌న్నిహితుడు శ్రీధ‌ర్‌పై కూడా విచార‌ణ జ‌ర‌పాలంటూ కోరారు. టీఆర్ఎస్ ముఖ్య నేత‌లంతా ఆల‌య భూముల కబ్జాల్లో ఉన్నార‌ని ఆరోపించారు. ఇక 437స‌ర్వే భూముల వివ‌రాల‌ను మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్కు ఫోన్ చేసి అడిగారు. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ వ‌స్తాన‌ని, ద‌ర్యాప్తు స్పీడ్ గా జ‌ర‌పాల‌ని కోరారు

Related Posts