నెల్లూరు
అల్లూరి సీతారామారాజు కు భారతరత్న ఇవ్వాలని అల్లూరి సీతారామరాజు యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరి సీతారామరాజు వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు కె. రమాదేవి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .శుక్రవారం స్థానిక ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవాలయం వద్ద, అల్లూరి సీతారామారాజు వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ , అల్లూరి సీతారామరాజు భారత దేశానికి స్వాతంత్య్రం సంపాదించటములో పోరాడినా మొదటి వ్యక్తి అని ఆయన సేవలను కొనియాడారు .కుల, మతాలకు వ్యతిరేకంగా అడవిలో ఉన్నవారినందరినీ ఏకంచేసి, బ్రిటీష్ వారిపై పోరాటానికి పూనుకున్న తొలి స్వతంత్ర సమరయోధుడు అన్నారు . ఆయన న ఆశయాలను నేటితరం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు . ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాశ్ మాట్లాడుతూ శుక్రవారం అల్లూరి వర్ధంతి తోపాటు, రాష్ట్ర తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతిని జాతికి స్ఫూర్తి కలిగించి ,స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలను మేల్కొల్పిన జనగణమన వ్రాసిన రవీంద్రనాథ్ టాగూరు వర్ధంతిని అదేవిధంగా సినీ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన ఆచార్య ఆత్రేయ పుట్టినరోజు అని ఆయన అన్నారు. ఆ మహానీయులందరికి శ్రద్ధాంజలి ఘటించారు .అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పేదలకు చీరలు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో ఎం. సునీల్కుమార్ .సుస్మిత .పూర్ణిమా. సింధు. దివ్య తదితరులు పాల్గొన్నారు