అనంతపురం
రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో అనంతపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరోపణలు రుజువు కావడంతో రెండో పట్టణ పోలీసులు ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అనంతపురం సాయినగర్ లో ఉన్న సాయి రత్న అనే ఆస్పత్రిలో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో విజిలెన్స్ డిఎస్పి హుస్సేన్ పీరా సిబ్బంది దాడులు చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, అలాగే ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ రోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు లభ్యమయ్యాయన్నారు. కరోనా సంబంధిత ఇంజెక్షన్లను సైతం అధిక ధరలకు విక్రయించినట్లు తెలిసిందన్నారు. రోగుల ఫిర్యాదు మేరకు ఆసుపత్రి పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు..