విజయవాడ
ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసన కార్యక్ర మాలు చేపట్టారు.వ్యాక్సిన్ సరఫరా చేయండి.. ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో నిరసనలు కొనసాగిస్తు న్నారు. చేయనుంది.18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రభుత్వం వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖలో టీడీపీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేతలు వ్యాక్షిన్ విషయంలో ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. సీఎం హోదాలో ఉండి వ్యాక్షిన్ ను ప్రతిఒక్కరికి అందించడంలో జగన్ వైఫల్యం చెందారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ప్రతిఒక్కరికి వ్యాక్షిన్ అందించాలని డిమాండ్ చేశారు.కరోనా కట్టడిలో సీఎం జగన్ మోహన్ రెడ్డి విఫలమ య్యారని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు.చిత్తశుద్ధి ఉంటే జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చదువురాని వ్యక్తి సీఎంగా ఉన్నా ప్రజలు రాష్ట్రాన్ని కాపాడేవారని విమర్శించారు. జగన్ పొరుగు రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. కేసుల భయంతోనే ప్రధాని మోదీని సీఎం పొగుడుతున్నా రని అచ్చెన్న ఎద్దేవా చేశారు. కేసులు పెట్టాల్సింది చంద్రబాబుపై కాదని.. ప్రజల చావుకు కారణమవుతున్న జగన్పై కేసులు పెట్టాలని అచ్చెన్న ధ్వజమెత్తారు.