జగిత్యాల మే 09
రూరల్ మండల హబ్సిపూర్ గ్రామానికి చెందిన బి. రమ్య కి ఇటీవల శస్త్ర చికిత్స జరగగా వారు సీఎం సహాయనిదికి దరఖాస్తు చేయగా సీఎం సహాయనిది ద్వారా మంజూరైన రూ. 50,500 విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజాయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ అనారోగ్యంతో భాదపడుతూ కార్పోరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే స్దోమత లేని నిరుపేదలకు సీఎం సహాయనిధి ఆసరాగా ఉంటుందని అన్నారు. కరోనా విపత్కర పరిస్దితుల్లోనూ పెద్దమెత్తంలో సహాయనిధి అందించటం అభినందనీయమన్నారు. ఒక్క నియోజకవర్గంలో కొన్ని వేల మందికి సీఎం సహాయనిధి ద్వారా లబ్ది పొందారని,పదివేల నుండి ఐదు లక్షల వరకు సాయం అందించటంపై సియం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.