రాయ్పూర్ మే 10
మావోయిస్టులపై కరోనా ఎఫెక్ట్ పడుతోంది. కరోనాతో మావోలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు పోలీస్ వర్గాలకు సమాచారం అందుతున్నది. మెరుగైన వైద్యం కోసం వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల రాక కొసం పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. పార్టీని వీడి వస్తే వైద్య సదుపాయం అందించడంతో పాటు ఆర్ధికంగా కూడా ఆందుకుంటామని భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం మావోలకు కరోనా ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు.ఛత్తీస్గఢ్ బస్తర్ రీజన్లో దంతేవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాల్లో సుమారు 70 నుంచి 100 మంది వరకు మావోయిస్టులకు కరోనా సోకినట్టు సమాచారం. ఈ విషయాన్ని పోలీస్ వర్గాలు కూడా దృవీకరిస్తున్నాయి. కరోనాతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. వీరిలో మోస్ట్ వాంటెడ్ మహిళ మావోయిస్టు సుజాత (25లక్షల రూపాయల రివార్డ్)తో పాటు 10 లక్షల రూపాయల రివార్డులు కలిగిన మావోయిస్టులు జయలాల్, దినేష్ ఉన్నట్టు సమాచారం. కోవిడ్తో బాధపడుతున్న మావోలు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లయితే వారందరికీ ప్రభుత్వం తరపున మంచి వైద్యం అందిస్తామని దంతేవాడ ఏస్పీ అభిషేక్ పల్లవ్ హామీ ఇచ్చారు.