హైదరాబాద్ మే 10
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామికి కరోనా నిర్ధారణ అయ్యింది. కరోనా లక్షణాలు కనిపించడంతో నిన్న ఆయన పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో ఆయనకు పాజిటివ్గా తేలింది. దీంతో చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని తెలిపారు.ఎన్ రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా గత శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాలుగు రోజులకే ఆయన కరోనాబారిన పడ్డారు. అదేవిధంగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైనవారిలో 11 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు.