YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

మధ్యే మార్గంగా గాలి సతీమణికి ఎమ్మెల్సీ టిక్కెట్

మధ్యే మార్గంగా గాలి సతీమణికి ఎమ్మెల్సీ టిక్కెట్

దివంగత నేత గాలి ముద్దుకృష్ణనాయుడు సతీమణి గాలి సరస్వతమ్మకు చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ టిక్కెట్‌ ఖరారైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఉదయం సీఎంను గాలి సరస్వతమ్మ, ఇతర కుటుంబసభ్యులు కలుసుకున్నారు. ఎమ్మెల్సీ టిక్కెట్‌‌ను సరస్వతమ్మకు ఖరారు చేసినట్లు సీఎం చంద్రబాబు వారికి తెలియజేశారు. గాలి మృతితో ఖాళీ అయిన చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి గాలి తనయులిద్దరూ పోటీ పడ్డారు. దీంతో మధ్యే మార్గంగా గాలి సతీమణికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించారు. సరస్వతమ్మకు టిక్కెట్ కేటాయింపుపై గాలి కుటుంబసభ్యుల్లోనూ ఏకాభిప్రాయం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related Posts