హైదరాబాద్, మే 11,
అసలు ఏం సీఎమ్మో ఏమో. ఏం నిర్ణయాలు తీసుకుంటారో ఏమో. కేసీఆర్ మాటలకు జనాలు ఏదో పూనకాలు వచ్చి ఓట్లేస్తున్నారు కానీ.. ఈ నిర్ణయాల గురించి గానీ ఆలోచిస్తే.. అసలు టీఆర్ఎస్ పరిస్థితి ఏంటీ అన్నది ఆయనకి అర్దం అవుతుందో లేదో. సీఎం కేసీఆర్ పెద్ద లీడరే. పేరున్న లీడరే. పొలిటికల్ ప్లానింగ్ లో ఆయనకు ఎదురే లేదు. అయితే.. ఇప్పుడు ఈటెల నిర్ణయం మాత్రం.. జనం పై క్లియర్ గా కనిపిస్తోంది. మంత్రి పదవి నుంచి ఇప్పుడు వేరే ఏదో మినిస్టర్ ని తొలగించి ఉంటే ఇంత సీన్ అయ్యేది కాదు. కానీ.. ఉండాల్సిన టైంలో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రిని తొలగించారు. పైగా ఆయన చేతిలో పెట్టుకున్నారు పదవిని. అక్కడే వచ్చింది సమస్య.ఈటెల ఉన్నప్పుడు ఆయన చేతిలో పవర్స్ ఉన్నాయా లేదా అనేది వదిలేద్దాం. ఉండే ఉంటయ్. ఎందుకంటే.. ఆక్సిజన్ కోసం యుద్ధ విమానాలు పంపించారంటే మామూలు విషయమా చెప్పండి. మంచి యాక్టివ్ మినిస్టరే కదా. అంతకు ముందు కూడా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉండేవారు.
కరోనా టైంలో.. ఈటెల చాలా అలర్ట్ గా ఉన్నారు. కరోనా ఉన్నా కానీ.. హాస్పిటల్స్ లో తిరిగే వారు. పేషెంట్లని పలకరించే వారు. ఏర్పాట్లు చూసుకునే వారు. అప్డేట్స్ ఇచ్చే వారు. రోజూ అక్కడో ఇక్కడో జనంలో ఉంటూ.. ఏం పర్లేదు. ఏం కాదులే.మంచిగనే ఉంటుందిలే అనే వారు. కరోనా పేషెంట్లకి ఆయన మాటలే సగం బలాన్నిచ్చేవి. ధైర్యంగా కరోనాతో పోరాడి బయట పడే వారు.ఇప్పుడేమైంది. ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్ తన చేతిలో పెట్టుకున్నారు. పోయిన సారే.. ఫామ్ హౌజ్ నుంచి బయటికి రాలేదు.. ప్రగతి భవన్ నుంచి బయటికి రాలేదు అని ఎన్ని మాటలు అన్నారో ఆయనకి మాత్రం తెలీదా చెప్పండి. ఇప్పుడు కూడా కరోనా విషయంలో ఏ మాత్రం కేర్ తీసుకోవడం లేదు. పైగా ఆరోగ్య మంత్రిగా ఉన్న ఈటెలను తొలగించి.. ఆ కాస్త పెద్ద దిక్కును కూడా లేకుండా చేశారు. ఇప్పుడు జనానికి ధైర్యం చెప్పేది ఎవరు. హాస్పిటల్స్ తిరిగేది ఎవరు. సమస్యలు పరిష్కరించేది ఎవరు అంటూ.. జనం కేసీఆర్ నే అంటున్నారు. ఈటెల లేని లోటు క్లియర్ గా తెలుస్తోంది అని మేథావులు చెబుతున్నారు