YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తెనాలిలో ఎమ్మెల్యే సైకిల్ యాత్ర

తెనాలిలో ఎమ్మెల్యే సైకిల్ యాత్ర

విభజన హామీలు అమలు  చేయడంలో కేంధ్ర ప్రభుత్వం అవలంబిసున్న వైఖరికి నిరసనగా తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికీ సైకిల్ యాత్ర కు తెనాలి విశేష స్పందన లభిస్తోంది. తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ చేపట్టిన ఇంటింటికీ సైకిల్ యాత్ర పట్టణంలో 8వ రోజుకు చేరింది. సైకిల్ యాత్రలో భాగంగా శనివారం ఉదయం 3,4 వార్డులలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు ఆలపాటి వివరించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బిజేపీతో లాలూచీ పడి రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని ఆలపాటి విమర్శించారు. నాడు అదికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేస్తే..నేడు బిజేపీ ద్రోహం చేస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నా కేంద్రం కనికరం చూపడం లేదని విమర్శించారు..కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేక హోదా సాధించుకోవాలని ఆలపాటి పిలుపునిచ్చారు. 

Related Posts