YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బ‌స్త‌ర్ అడవుల్లో క‌రోనాతో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి

బ‌స్త‌ర్ అడవుల్లో క‌రోనాతో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి

రాయ్‌పూర్ మే 11
అడ‌వుల్లో ఉండే మావోయిస్టుల‌ను సైతం క‌రోనా వైర‌స్ వ‌ద‌ల‌డం లేదు. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దంతెవాడ జిల్లా ద‌క్ష‌ణి బ‌స్త‌ర్ అడవుల్లో క‌రోనాతో 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు దంతెవాడ ఎస్పీ అభిషేక్ ప‌ల్ల‌వ వెల్ల‌డించారు. మ‌రో 100 మంది క‌రోనా బారిన ప‌డిన‌ట్లు త‌మ‌కు స‌మాచారం ఉంద‌ని ఆయ‌న తెలిపారు. క‌రోనా సోక‌డం, క‌లుషిత ఆహారం తిన‌డంతో మావోయిస్టులు చ‌నిపోయిన‌ట్లు తెలుస్తున్న‌ది.క‌రోనాతో చ‌నిపోయిన వారిలో మావోయిస్టు అగ్ర‌నేత‌లు ఉన్న‌ట్లు స‌మాచారం. అయితే మృతి చెందిన మావోయిస్టుల పేర్లు వెల్ల‌డి కాలేదు. ఇక కుంట‌, డోర్న‌పాల్ ఏరియాల్లో మావోయిస్టులు క‌రోనా వ్యాక్సిన్‌తో పాటు దానికి సంబంధించిన ఔష‌దాల‌ను దొంగిలించిన‌ట్లు పోలీసులు తెలిపారు.క‌రోనా సోకిన వారిలో మోస్ట్ వాంటెడ్ మహిళ మావోయిస్టు సుజాత (25లక్షల రూపాయల రివార్డ్)తో పాటు 10 లక్షల రూపాయల రివార్డులు కలిగిన మావోయిస్టులు జయలాల్, దినేష్‌ ఉన్నట్టు సమాచారం. కొవిడ్‌తో బాధపడుతున్న మావోలు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లయితే వారందరికీ ప్రభుత్వం తరపున మంచి వైద్యం అందిస్తామని దంతెవాడ ఎస్పీ అభిషేక్ ప‌ల్ల‌వ‌ హామీ ఇచ్చారు.
 

Related Posts