అందరి సపోర్ట్ తో ప్లీనరీ విజయవంతం అయింది. ప్లీనరీ విజవంతం కావడానికి కారకులైనవారందరికి కృతజ్ఞతలని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. శనివారం నాడు అయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ. కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యమ్నాయం గా ఏదగాలే ఆలోచన కేసీఆర్ చేసారు. తెలంగాణ రాష్ట్రం కోసం 36పార్టీలను ఏలా అయితే ఓక్క తాటిపైకి తెచ్చామో ,ఫెడరల్ ఫ్రంట్ కు కూడా అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెస్తం. తెలంగాణ అభివృద్ధి చెందుతుంటె ఇష్టపడ్డని కాంగ్రెస్. బీజేపీ నాయకులు ఇష్టమోచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమాటలు మాట్లాడుతున్నాడు. ఆధారాలు లేని ఆరోపనలు చేస్తున్నారని విమర్శించారు. ప్రగతి భవన్ ఏ ఓక్కరిదో కాదు అది ముఖ్యమంత్రి నివాసం. కేటీఆర్ పై ఇష్టమోచ్చినట్లు మాట్లాడుతున్నారు. కేటీఆర్ నిప్పులాంటోడు నిప్పుతో చెలగాటం ఆడొద్దు ...కాలిపోతావని హెచ్చరించారు. రేపు మిత్రపక్షంగా మారే కాంగ్రెస్ ,టీడీపీ తెలంగాణ కు ఏంచేసారో ప్రజలకు తెలుసు. హెటిరో కంపెనీ ిక్యాన్సర్ ఇన్సిట్యూట్ కు 15ఏకరాలలను రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇది కేటీఆర్ సంబంధించిన శాఖ కాదని వివరణ ఇచ్చారు.