YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

అత్యాచారాలకు పాల్పడే వారిని గల్ఫ్ దేశాల మాదిరిగా బహిరంగంగా ఉరితీయాలి ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి

అత్యాచారాలకు పాల్పడే వారిని గల్ఫ్ దేశాల మాదిరిగా బహిరంగంగా ఉరితీయాలి      ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి

మహిళపై అత్యాచార ఘటన దారుణమన్నారు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి. అత్యాచారాలకు పాల్పడే వారిని గల్ఫ్ దేశాల మాదిరిగా భారత్‌లో కూడా బహిరంగంగా ఉరితీయాలన్నారు.మృగాళ్లు అత్యాచారానికి ప్రయత్నిస్తే బాధితులకు అందుబాటులో ఏది దొరికితే దాంతో చంపేయాలని నన్నపనేని పిలుపునిచ్చారు. కాలం చెల్లిన చట్టాలను మార్చారా అని ప్రశ్నించారు. మహిళలు అత్యాచారాలకు, హత్యలకు గురి కావాల్సిందేనా, అని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ దేశాల మాదిరిగా భారత్‌లో కూడా బహిరంగంగా ఉరితీయాలన్నారు. మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉండి తాను ఏమీ చేయలేక పోతున్నానని నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఒప్పిచర్లలో మహిళపై అత్యాచార ఘటన దారుణమన్నారు. ఢిల్లీలో నిర్భయ ఘటన తరహాలో అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. అత్యాచార ఘటనల్లో తీర్పులు త్వరగా వచ్చి.. మరణ శిక్ష వేయాలని నన్నపనేని కోరారు.

Related Posts