శుక్రవారం నాడు జరిగిన తెరాస ప్లీనరీ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడాటూ డు ఉత్తమ్ మీద వ్యక్తిగతంగా విమర్శించారు. దీనిని నేను పూర్తిగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ అన్నారు. శనివారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్ కుమార్ అంటే సామాన్యమైన వ్యక్తి కాదు మిలటరీ మాన్. ఖబర్ధర్.. నువు మాట్లాడింది కరెక్ట్ కాదు. అసలు ఎవరు నువు నీ బాక్ గ్రౌండ్ ఏంటి నువు సైనికుడివా అంటు విరచుకుపడ్డారు. నీవు ప్లీనరీ లో ప్రజలకి మంచి చెప్తావాని అనుకుంటే విమర్శించటమే పని గా పెట్టుకున్నావని విమర్శించారు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కు వెళ్లి అందులో మీటింగ్ పెట్టి హైదరాబాద్ కి భూకంపం తెప్పిస్తా అని చెప్పు అని సవాలు విసిరారు. నువ్వు ఒక్క బ్రిడ్జి కట్టినవా.. ఒక ట్యాంక్ కట్టావా అని ప్రశ్నించారు. నీకు ఫేక్ కేసీఆర్ అని పేరు ఉంది. అలాంటి నువు మా అధ్యక్షుడు ని తిట్టడానికి నీకు ఎంత ధైర్యమని ఆరోపించారు.