YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల పర్యటన

వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల పర్యటన

నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా  వేల్పూర్ మండల కేంద్రంలో ఇంటింటి ఆరోగ్య సర్వేను  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం పరిశీలించారు. మండల కేంద్రంలోని కొన్ని ఇండ్ల వద్దకు వెళ్లి హెల్త్ సర్వేకు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా అని వాకబు చేశారు.ఆరోగ్యం ఎట్లా ఉందని చిన్నా, పెద్దలను ఆత్మీయంగా పలకరించారు.  సర్వేకు వచ్చే వారికి మీ కుటుంబ ఆరోగ్య వివరాలు అందిస్తే..ఏమైనా సమస్య ఉన్నట్లు తేలితే త్వరగా చికిత్స అందించడానికి వీలువవుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సర్వే మీ ఆరోగ్యం కోసమే తప్పా... భయపడాల్సిన అక్కర్లేదు అన్నారు.మీకు ఏమైనా ఆరోగ్య సమస్య తలెత్తితే.. మీ దగ్గర లోని ఏ ఎన్ ఎమ్,ఆశా వర్కర్స్ కు సమాచారం అందించాలని కోరారు.పారిశుద్ధ్య విధుల్లో ఉన్న సానిటేషన్ సిబ్బందిని మంత్రి పలకరించారు.మీకు ఇచ్చిన సేఫ్టీ కిట్ వాడుతూ పనిచేయాలని సూచించారు.
మండల కేంద్రంలో వివరాలు సేకరిస్తున్న ఆశా వర్కర్స్ ఎదురపడగా..కోవిడ్ లక్షణాలు ఉన్న వారి వివరాలు, సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు.సర్వే చేసే కుటుంబంలో ప్రతి ఒక్కరిని పరిశీలించాలని వారికి సూచించారు.ఒక్కరే అందరి ఆరోగ్యం గురించి కచ్చితంగా చెప్పలేరు కాబట్టి మీరే ఒక్కొక్కరిని పరిశీలించి వారితో మాట్లాడాలని చెప్పారు.

Related Posts