నెల్లూరు
నెల్లూరు జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సీఐ వేమారెడ్డి ల బదిలీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దురంహంకా రానికి నిదర్శనమని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి విమర్శించారు.ఇసుక దోపిడీని అడ్డుకో వడంతోనే అధికారులను బదిలీ చేశారని ఆరోపించారు.రాష్ట్రంలో రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా అని,దాన్ని గుర్తించి అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలని భావించిన పవన్ కళ్యాణ్ ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారని చెప్పారు. జిల్లాలో పని చేస్తున్న అధికారులపైనే తీవ్రంగా వేధింపులు జరుగుతున్నా యని,మంత్రి అనిల్ కు జిల్లా మొత్తాన్ని ఇష్టప్రకారం దోచుకోమని, ఆ దోపిడీ లకు అడ్డొచ్చిన అధికారులను బదిలీ చెయ్యడం సరి కాదని అన్నారు.