YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఢిల్లీలో ఎక్సెస్ ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు తరలింపు

ఢిల్లీలో ఎక్సెస్ ఆక్సిజన్ ఇతర రాష్ట్రాలకు తరలింపు

న్యూఢిల్లీ, మే 13, 
కోవిడ్ సెకండ్ వేవ్‌తో అతలాకుతలమైన దేశ రాజధాని ఢిల్లీలో సీన్ రివర్సైంది. లాక్‌డౌన్ వంటి కఠిన చర్యలతో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. కొద్ది వారాల కిందటఆక్సిజన్ దొరక్క ఆస్పత్రుల్లో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయిన అత్యంత దయనీయ పరిస్థితుల నుంచి ఢిల్లీ గట్టెక్కింది. రాష్ట్రంలో మిగులు ఆక్సిజన్‌ ఉందని.. ఆక్సిజన్‌ను వేరే రాష్ట్రాలకు కేటాయించాలంటూ కేంద్రానికి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని.. పాజిటివిటీ రేటు గణనీయంగా పడిపోయిందని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. పదిహేను రోజుల కిందటి వరకూ రోజుకి 80 వేల నుంచి లక్ష నిర్ధారణ పరీక్షలు చేస్తే 27 వేల నుంచి 28 వేల కేసులు నమోదయ్యేవని తెలిపారు. ప్రస్తుతం పది వేల కొత్త కేసులు వస్తున్నాయన్నారు. కరోనా ఉధృతి కొనసాగుతున్న సమయంలో రోజుకి 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అయ్యేదని.. ప్రస్తుతం డిమాండ్ 582 మెట్రిక్ టన్నులకు పడిపోయిందని చెప్పారు. మిగులు ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు కేటాయించాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు చెప్పారు.తమది బాధ్యతాయుతమైన ప్రభుత్వమని సిసోడియా అన్నారు. కరోనా కష్టకాలంలో అండగా నిలిచిన ఢిల్లీ హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి మనీష్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 35 శాతం నుంచి 14 శాతానికి పడిపోయిందని సిసోడియా వెల్లడించారు. ఆస్పత్రుల నుంచి అత్యవసర ఫోన్ కాల్స్ కూడా గణనీయంగా తగ్గిపోయాయన్నారు. అయితే వ్యాక్సిన్ కొరతను నివారించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ తయారీ కంపెనీలతో సహకారంతో వీలైనంత త్వరగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు

Related Posts