YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

అంబులెన్సులను ఆపడం అమానుషం

అంబులెన్సులను ఆపడం అమానుషం

అమరావతి
తెలంగాణలో తిరిగి గురువారం రాత్రి నుండి అంబులెన్సులను సైతం అనుమతిం చని తెలంగాణ పోలీసులు.ఆధారాలతో సహ మీరుపంపుతున్నాను.సరిహద్దుల్లో రోగుల ఆర్తనాదాలు వినండి.వారి సమస్య పరిష్కరించి ప్రాణాలు కాపాడండని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కర్నూలు బార్డర్ లో రోగులు  ఆక్రందనలు చేస్తుంటే ఆంధ్ర పోలీసులు, ఇతర అధికారులు  చేతులెత్తేసారని అయన విమర్శించారు. సాదారణ ప్రయాణికులను 6 గంటలనుండి తోమ్మిది గంటల వరకు అనుమతించి తెలంగాణ పోలీసులు అంబులెన్స్ లను మాత్రం వెనక్కి పంపుతున్నారు. ఇంతకంటే ఘోరం ,సిగ్గుచేటు మరొకటి లేదని అయన అన్నారు. సాధారణ ప్రజలు తెలంగాణ లోని పోలీసు కంట్రోల్ రూమ్ లో అనుమతులును తీసుకోవడం అది అంబులెన్సు ఉన్న రోగికి వారి బందువులకు సాధ్యమా అని అయన ప్రశ్నించారు. ఆంధ్ర పోలీసులు రోగులకు ఇచ్చిన ఈ పాస్ ను సైతం తెలంగాణ పోలీసులు లెక్కచేయడంలేదని అయన విమర్శించారు.

Related Posts