YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రంలో విధ్వంసమే…అభివృద్ది శూన్యం

రాష్ట్రంలో విధ్వంసమే…అభివృద్ది శూన్యం

విశాఖపట్నం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని, ఇప్పటికే కరోనా మహమ్మారివల్ల 9, 10 వేల మంది చనిపోతే ముఖ్యమంత్రి ఏం చేశారని ప్రశ్నించారు. ఇంత జరిగినా సీఎం బాధ్యతారహితంగా మాట్లాడు తున్నారని, కరోనాతో సహజీవనం చేయాలని నీతిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న వ్యవసాయశాఖ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాస్క్ లేకుండా కనిపించారని దుయ్యబ ట్టారు. ఈ కార్యక్రమంలో ఒక్క జగన్కు తప్ప అందరికీ మాస్క్ ఉందని అన్నారు. తమిళనాడులో సినీ పరిశ్రమకు సంబంధించినవారు ముఖ్యమంత్రి స్టాలిన్కు చెక్కు ఇవ్వడానికి వెళితే.. సీఎం మాస్క్ పెట్టుకుని బాధ్యతగా వ్యవహరిం చారన్నారు. స్టాలిన్ను చూసి జగన్ నేర్చుకోవాలన్నారు.ఏపీ రాష్ట్రంలో కనీసం పేదలకు భోజనం పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో అన్నా క్యాంటిన్లు పెట్టామని, రూ. 5లకే పేదలకు భోజనం అందించామన్నారు. ఈ ప్రభుత్వం అన్నా క్యాంటిన్లు అలాగే కొనసాగించితే పేదలు భోజనం చేసేవారన్నారు. సీఎం జగన్ అన్నా క్యాంటిన్లను మూసివేసి పేదలకు అన్నం లేకుండా చేశారని మండిపడ్డారు. అన్నా క్యాంటిన్ పేరు ఇష్టం లేకపోతే కనీసం వైఎస్ పేరుమీద అయినా ఆ క్యాంటిన్లు కొనసాగిస్తే బాగుండేదని అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు.

Related Posts