YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరోనా వారియర్లకు ఇన్సెంటివ్ ఇవ్వాలి బండి సంజయ్

కరోనా వారియర్లకు ఇన్సెంటివ్ ఇవ్వాలి బండి సంజయ్

హైదరాబాద్
ఎంజీఎం, కరీంనగర్ సివిల్  ఆస్పత్రుల పరిస్థితి చూస్తే బాధ కలుగుతుంది. కోవిద్ వార్డుల్లా లేవు. సాధారణ వార్డుల కంటే అధ్వానంగా వుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.  అక్కడ సిబ్బంది కోరత వేధిస్తుంది. వైద్యురాలు శోభరాణీ మృతి చెందారు. నలుగురు  లాబ్ టెక్నీషియన్లు మృతి చెందారు. వున్న సిబ్బంది పై పని భారం పడుతుంది. వైద్య సిబ్బంది, పార మెడికల్, ల్యాబ్ టెక్నీషియన్లు, పోలీసులు సెక్యూరిటీ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది కి నిన్సెంట్యుస్ ఇవ్వండి.మానవత ఉద్దేశంతో సేవలు అందించే వారి కుటుంబాలను ఆదుకోవాలి. మేము రాజకీయ కోణంలో విమర్శించడం లేదు. అన్ని విధాల సహకరిస్తాము.  వారికి కుటుంబాలు వున్నాయి. మరణాల సంఖ్య కరోనా బాధితుల సంఖ్య తక్కువ చేసి చూపుతున్నారు. సీఎం కేర్స్ పండ్ నుంచి 100 వెంటిలేటర్స్ కేంద్రం ఇచ్చిన వాటిని వినియోగించ లేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అయన అన్నారు. పీపీఈ  కిట్లు లేవు. సర్జికల్ మాస్క్ లు లేవు. రేమిదిసివర్ ఇంజెక్షన్ల కొరత, ఆక్సిజన్ కొరత వేధిస్తుంది. పేషంట్లను కాపాడే ప్రయత్నం చేయండి. అన్ని వున్నాయని రాష్ట్రం చెబుతున్న అన్ని కొరతగా ఉన్నాయి. ప్రజల ప్రాణాలతో చటడుతున్నారని అయన విమర్శించారు.

Related Posts