YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గౌరవ డాక్టరేట్ గ్రహీతల జాబితా నుంచి అమితాబ్ పేరు తొలిగింపు

గౌరవ డాక్టరేట్ గ్రహీతల జాబితా నుంచి అమితాబ్ పేరు తొలిగింపు

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌కు రవీంద్ర భారతి యూనివర్సిటీ (ఆర్బీయూ) ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఏడాది గౌరవ డాక్టరేట్ గ్రహీతల జాబితా నుంచి ఆయన పేరును తొలగించింది. గవర్నర్ కేసరి నాథ్ త్రిపాఠి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్బీయూ వైస్ చాన్సిలర్ సవ్యసాచి బసు రాయ్ చౌదరి వెల్లడించారు. స్నాతకోత్సవానికి రాని వారికి గౌరవ సత్కారం ఇవ్వరాదని త్రిపాఠి స్పష్టం చేసినట్టు చౌదరి వెల్లడించారు.ముందస్తు షూటింగ్‌ల కారణంగా తాను మే8 న జరిగే ఆర్బీయూ 43వ స్నాతకోత్సవాలకు రాలేననీ... డి లిట్ స్వీకరించలేనని అమితాబ్ చెప్పడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. కాగా ఈ ఏడాది ఆర్బీయూ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్న ప్రముఖుల్లో ప్రముఖ రచయిత్రి నబంతియా దేవ్ సేన్, చిత్రకారుడు జతిన్ దాస్, శాస్త్రీయ గాయకుడు పీటీ. అమియా రంజన్ బందోపాధ్యాయ్ తదితరులు ఉన్నట్టు వీసీ వెల్లడించారు.

Related Posts