దేశంలో మార్పు తెస్తాననటం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కేసీఆర్ దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్కు ఓట్లతో బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత గండ్ర వెంకటరమణారెడ్డి చేపట్టిన రైతు భరోసా పాదయాత్ర ముగిసింది. 43 రోజుల పాటు సాగిన పాదయాత్రలో గండ్ర.. 953 కిలోమీటర్లు మేర నడిచారు. ఈ నేపథ్యంలోనే శనివారం శాయంపేట మండలం గట్లకానిపర్తిలో పాదయాత్ర ముగింపు సభ నిర్వహించారు. పాదయాత్రకు చిహ్నంగా స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ సభకు భట్టి విక్రమార్క, గండ్ర జ్యోతి, నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు.