హైదరాబాద్
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు సోమవారం ఉదయం విచారణ చేపట్టింది. డీజీపీతోపాటు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు విచారణకు హాజరయ్యారు. కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సమయంలో నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్న ముగ్గురు కమిషనర్లను తెలంగాణ హైకోర్టు అభినందించింది. లాక్డౌన్, కరోనా నిబంధనల అమలుపై నివేదకను కోర్టుకు సమర్పించారు. ‘ఈ సందర్భంగా లాక్డౌన్ సమయంలో, రిలాక్సేషన్ సమయంలో వీడియో గ్రఫీ తీసిన ఫుటేజ్ను ముగ్గురు హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు హైకోర్టుకు సమర్పించారు. ‘ఔషధాల బ్లాక్ మార్కెట్పై 98 కేసులు నమోదు అయ్యాయి. మాస్కులు ధరించని వారిపై 3,39,412 కేసులు నమోదు అయ్ఆయయి. జరిమానా కింద రూ.31కోట్లు వసూలయ్యాయి. భౌతికదూరం పాటించనందుకు 22,560 కేసులు నమోదు అయ్యాయి. లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అని డీజీపీ మహేందర్ రెడ్డి కోర్టుకు తెలిపారు. లాక్ డౌన్ గైడ్ లైన్స్ను పటిష్టంగా అమలు చేసినందుకు ముగ్గురు సీపీలను హైకోర్టు అభినందించింది. ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించింది.