YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

జీఎస్టీ చెల్లింపుదారులకు గుడ్ న్యూస్

జీఎస్టీ చెల్లింపుదారులకు గుడ్ న్యూస్

ముంబై, మే 17, 
కరోనా వైరస్ కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం వ్యాపారులకు తీపికబురు అందించింది. ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్CBIC ట్యాక్స్ రిఫంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది. దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ కలుగనుంది. వ్యాపారులు లిక్విడిటీ సమస్యలు ఎదుర్కోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా చాలా మంది వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కేంద్రం తాజా నిర్ణయంతో వీరికి ఊరట కలుగనుంది.15 నుంచి మే 31 వరకు ప్రత్యేకమైన జీఎస్‌టీ రిఫండ్ చెల్లింపు డ్రైవ్‌ను నిర్వహించాలని సీబీఐసీ ఇప్పటికే ఫీల్డ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పెండింగ్‌లో ఉన్న జీఎస్‌టీ రిఫండ్ చెల్లింపులు వెంటనే పూర్తి కానున్నాయి. వ్యాపారులకు జీఎస్‌టీ రిఫండ్ వెంటనే క్రెడిట్ అవుతుంది. మే 14 వరకు పెండింగ్‌లో ఉన్న జీఎస్‌టీ రిఫండ్ క్లెయిమ్స్ అన్ని మే 31లోపు సెటిల్ కానున్నాయి. ఇకపోతే జీఎస్‌టీ చట్టం ప్రకారం రిఫండ్ సెటిల్‌మెంట్‌కు 60 రోజుల దాకా గడువు ఉంటంది. అయితే జీఎస్‌టీ రిఫండ్ క్లెయిమ్ అప్లికేషన్ వచ్చి 30 రోజుల్లోనే సెటిల్‌మెంట్ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం అధికారులు ఆదేశాలు జారీ

Related Posts