YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఎంపీపై కన్నేసిన జేడీ

ఎంపీపై కన్నేసిన జేడీ

ఐపీఎస్ హోదాకు రాజీనామా చేసి, వాలంటరీ రిటైర్మెంట్‌తో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఇప్పటికే ఒకసారి జనాల మధ్యకు వచ్చారు. రైతులతో సమావేశం అయ్యి, తనే వ్యవసాయ శాఖ మంత్రిని అయితే ఏం చేస్తానో చెప్పారు. ఒకేసారి తను మంత్రిని అయితే ఏం చేస్తానో చెప్పడం, రాజకీయాల పట్ల ఈయనకు ఉన్న ఉత్సాహానికి నిదర్శనంగా మారింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ విషయంలో ఇప్పటి వరకూ ఏ ప్రకటనా చేయకపోయినా, మంత్రినైతే, అని ఈయన అనడం.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని స్పష్టం అవుతోంది.ఈ నేపథ్యంలో లక్ష్మినారాయణ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? అనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లక్ష్మినారాయణ ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో రెండు నియోజకవర్గాల పేర్లు వినిపిస్తుండటం గమనార్హం.కర్నూలు లేదా గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి లక్ష్మినారాయణ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు ప్రచారం సాగుతోంది. లక్ష్మినారాయణ భారతీయ జనతా పార్టీలోకి చేరతారు అని, కర్నూలు లేదా గుంటూరు సీటు నుంచి ఎంపీగా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ధ్రువీకరణ ఏమీ లేదు. త్వరలోనే తన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇస్తానని లక్ష్మినారాయణ ప్రకటించారు

Related Posts